ELECTRIC CNG LPG AUTORICKSHAWS – ELECTRIC VEHICLES IN ORR

హైదరాబాద్​లో ఈవీ, సీఎన్​జీ, ఎల్​పీజీ ఆటోలకు కొత్త రూల్స్ – మరీ మీకు తెలుసా?

ఓఆర్ఆర్లోపల కొత్త ఎల్పీజీ, సీఎన్జీ, ఎలక్ట్రిక్ ఆటోలకు అనుమతిఇటీవల ఆటోలకు సంబంధించిన జీవోను విడుదల చేసిన మంత్రి పొన్నంఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్ఫీజుపై వంద శాతం రాయితీ

Electric Autorickshaws in Hyderabad : హైదరాబాద్​లోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌) లోపల కొత్తగా సీఎన్‌జీ, ఎల్‌పీజీ, ఎలక్ట్రిక్‌ ఆటో రిక్షాలకు అనుమతిస్తూ రవాణా శాఖ కమిషనర్‌ సురేంద్ర మోహన్‌ ఆదివారం(జులై 6) ఉత్తర్వులను జారీ చేశారు. ఓఆర్‌ఆర్‌ లోపల సంబంధిత ఆటోలకు అనుమతి కల్పిస్తూ ట్రాన్స్​పోర్ట్​ మినిస్టర్ పొన్నం ప్రభాకర్‌ ఇటీవల జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయా మార్గదర్శకాలను కమిషనర్ సురేంద్ర మోహన్‌ జారీ చేశారు. దీనిలో భాగంగా సంబంధిత ఈవీ, సీఎన్​జీ, ఎల్​పీజీ వాహనాలను రాష్ట్రంలోని ఏ ఆటోరిక్షా డీలర్‌ వద్ద అయినా కొనుగోలు చేయవచ్చు.

నిబంధనలు ఇలా

  • ఆటో లైసెన్స్‌ కలిగిన వ్యక్తి ఓఆర్‌ఆర్‌ లోపల నివసిస్తూ ఉండాలి.
  • ఒకరికి ఒక ఆటో కొనుగోలు చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది.
  • తన పేరుపై మరో ఆటో లేదని సంబంధిత వ్యక్తి ధ్రువీకరణ పత్రమివ్వాలి. ఫస్ట్‌ కమ్‌-ఫస్ట్‌ సర్వీసు పద్ధతిలో పర్మిషన్ ఇస్తారు.
  • ఆమోదించిన 60 రోజుల్లో ఆటోను సదరు రవాణా శాఖ ఆఫీసులో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. లేనిపక్షంలో అది క్యాన్సిల్ అవుతుంది.

డీలర్లకు సూచనలు

  • డీలర్ల వద్దకు వచ్చిన పత్రాలను పరిశీలించి, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డ్రైవింగ్‌ లైసెన్సు వివరాలను డీలర్‌ లాగిన్‌లో నమోదు చేయాలి.
  • అన్నిపత్రాలను పూర్తిగా పరిశీలించే బాధ్యత మొత్తం డీలర్లదే. ఆ తర్వాతే పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో ఎంటర్​ చేయాలి.
  • వాహనం అమ్మకపు ధర కంటే ఎక్కువ మొత్తానికి డీలర్‌ కొనుగోలుదారుడికి అమ్మకూడదు. అనుమతుల కోసం ఫీజుల వసూలు చేయడం, బ్లాక్‌ మార్కెట్‌లో అమ్మడం తదితరాలు చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.

నూతన ఈవీ పాలసీ : విద్యుత్‌ వాహనాలు కొనుగోలు చేయాలనుకునేవారికి రవాణా శాఖ గతంలోనే శుభవార్త చెప్పింది. రోడ్‌ పన్ను, వాహన రిజిస్ట్రేషన్‌ ఫీజు 100 శాతం మినహాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈవీ పాలసీని రూపొందించామని ఈ సరికొత్త విధానం అమల్లోకి తెచ్చినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు.

పరిమితంగానే వాహనాలకు గత ప్రభుత్వం ఈవీ పాలసీని రూపొందించిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన నూతన విధానంలో వాహనాల సంఖ్యపై పరిమితుల్ని పూర్తిగా ఎత్తేసినట్లు మంత్రి పొన్నం ప్రకటించారు. ఈ రాయితీ పథకం 2026 డిసెంబరు 31 వరకు తెలంగాణ రాష్ట్ర పరిధిలో విద్యుత్‌ వాహనాలు ఎన్ని రిజిస్ట్రేషన్‌ అయితే అన్నింటికీ వర్తించనుంది.

రిజిస్ట్రేషన్ఫీజులో మినహాయింపు : అవసరమైతే ఈ గడువును పొడిగించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని, పన్నులు, ఫీజుల మినహాయింపుతో ఏటా రూ.వందల కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయినా భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. బైక్​లు, కార్లు, ఆటోలు, ఆర్టీసీతో పాటు ఐటీ, ఫార్మా సహా ఇతర పెద్ద పెద్ద కంపెనీలు తమ ఉద్యోగుల ట్రాన్స్​పోర్ట్​ కోసం ఎలక్ట్రిక్‌ బస్సులు కొంటే రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్‌ ఫీజులో 100 శాతం మినహాయింపు ఇస్తామని తెలిపారు.

ప్రస్తుత ఈవీ పాలసీ నిబంధనల మేరకు రెండో వాహనం కొనుగోలు చేస్తే వాహనదారు అదనంగా 2 శాతం పన్ను చెల్లించాలి. అయితే రెండో ఎలక్ట్రిక్‌ వాహనం కొన్న వారికి 2 శాతం అదనపు ట్యాక్స్​ను కూడా మినహాయిస్తామని పేర్కొన్నారు.

జీవో జారీ : ఎలక్ట్రిక్‌ వాహన నూతన పాలసీ – 2025కి సంబంధించిన జీవో 41ని రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌ జారీ చేశారు. ఎలక్ట్రిక్‌ వాహనాలు – ద్విచక్ర వాహనాలు, కార్లు, కమర్షియల్‌ ప్యాసింజర్‌ వాహనాలైన ట్యాక్సీలు, టూరిస్టు క్యాబ్‌లు, మూడు చక్రాల ఆటో రిక్షాలు, తేలికపాటి గూడ్సు వాహనాలు, ట్రాక్టర్లు, బస్సులకు రోడ్‌ ట్యాక్స్, రిజిస్ట్రేషన్‌ ఫీజులో 100 శాతం రాయితీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top