RS 14 Crore Scam in SBI Chennur branch

ఎస్​బీఐ బ్రాంచ్​లో భారీగా అవకతవకలు – ఏకంగా రూ.13.71 కోట్లు గోల్​మాల్​ – MASSIVE IRREGULARITIES IN SBI

ఎస్​బీఐలో భారీగా బంగారం, నగదు గోల్​మాల్​ – క్యాషియర్​ అందుబాటులోకి లేకపోవడంతో అనుమానాలు – కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
RS 14 Crore Scam in SBI Chennur branch : ఎస్​బీఐ బ్యాంకులో రూ.13.71 కోట్ల విలువైన నగదు, బంగారం గోల్​మాల్​ అయింది. మంచిర్యాల జిల్లా చెన్నూర్​ ఎస్​బీఐ బ్యాంకు రెండవ బ్రాంచ్​లో ఈ సంఘటన జరిగింది. ఇవాళ పోలీసులకు బ్యాంక్​ అధికారులు ఫిర్యాదు చేయడంతో మూడు రోజులుగా ఆడిట్​ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బ్యాంకులో జరిగిన అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయి.

బ్యాంక్​ క్యాషీయర్​గా పని చేస్తున్న రవీందర్​ పరారీలో ఉండటం ఈ వాదనలకు మరింత బలాన్ని చేకూర్చాయి. మొత్తం రూ.12.61 కోట్ల విలువ చేసే బంగారం, రూ.1.10 కోట్ల నగదు లెక్క తేలకపోవడంతో బ్యాంకు అధికారులు క్యాషీయర్​ రవీందర్​తో పాటు మరో పది మంది అనుమానితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ దేవేందర్​ తెలిపారు.

పరారీలో క్యాషియర్ : ఇంకా పూర్తి వివరాలను సీఐ దేవేందర్​ తెలిపారు. చెన్నూరు ఎస్​బీఐ శాఖలో అవకతవకలు జరిగాయని బ్యాంకు అధికారులు గుర్తించి ఫిర్యాదు చేశారన్నారు. మొత్తం రూ.13.71 కోట్లు విలువ చేసే బంగారం, నగదు మిస్​ అయినట్లు అందులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇది అంతా క్యాషియర్​ రవీందర్​ ఆధీనంలోనే జరిగినట్లు తెలుస్తోందన్నారు. అతడు కూడా పరారీలో ఉండటంతో ఆరోపణలకు ఇంకా బలం చేకూర్చింది.

అతడి కోసం సెర్చ్​ ఆపరేషన్​ చేస్తున్నామని, గాలిస్తున్నామని వివరించారు. అతడికి మరో 9 మంది సహకరించినట్లు సమాచారం. వారంతా జైపుర్​ వంటి ప్రాంతాల్లో ఉన్నట్లు తెలుస్తోందని, వారిని అనుమానితులుగా గుర్తించి వారిపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఖాతాదారులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. అతడు పట్టుబడితే పూర్తి వివరాలు బయటకు వస్తాయని సీఐ తెలిపారు.

“చెన్నూర్​ ఎస్​బీఐ శాఖలో అవకతవకలు జరిగాయని బ్యాంకు అధికారులు గుర్తించి, అందుకు సంబంధించిన ఫిర్యాదు చేశారు. దాని ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. అందులో రూ.12.61 కోట్ల విలువైన బంగారం, రూ.1.10 కోట్ల విలువైన నగదు మిస్​ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఎస్​బీఐలో క్యాషియర్​గా పని చేసే రవీందర్​ ఆధీనంలోనే ఇది జరిగినట్లు ఆరోపించారు. అతడు కూడా పరారీలో ఉన్నాడు. ఇతని గురించి సెర్చ్​ ఆపరేషన్​ చేస్తున్నాం. మా పై అధికారుల ఆదేశాల ప్రకారం కొన్ని టీంలను ఏర్పాటు చేసి గాలిస్తున్నాము. ఆ వ్యక్తి దొరికిన వెంటనే పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. ఈ విషయంపై ఖాతాదారులు ఎవరూ కూడా టెన్షన్​ పడాల్సిన అవసరం లేదు. అతడిని పట్టుకునే పనిలో నిమగ్నమై ఉన్నాము. తొందరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటాం. అనుమానితులను గుర్తిస్తున్నాం. పది మందిపై కేసు నమోదు చేయడం జరిగింది.” – దేవేందర్, చెన్నూరు సీఐ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top