AP IIIT 2025 2nd Phase Results: Cut Off Marks, Check Results

AP IIIT 2025 2nd Phase Results:

ఆంధ్రప్రదేశ్ లోని ఆర్జీయూకేటీ త్రిబుల్ ఐటీ 2025 ప్రవేశాల కోసం నూజివీడు, ఆర్కే ర్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్లలో ఉన్న సీట్లను భర్తీ చేయడానికి మొదటి విడత కౌన్సిలింగ్ నిన్నటితో పూర్తి చేశారు. మొదటి విడత కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత మొత్తం నాలుగు క్యాంపస్లు కలుపుకొని 702 సీట్లు మిగిలిపోయాయి. ఈ మిగిలిపోయిన 702 సీట్లను రెండవ విడత కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తామని అధికారులు తెలిపారు. అయితే మరికొద్ది రోజుల్లో రెండో విడత కౌన్సెలింగ్ ఫలితాలను విడుదల చేసి,అందులో పేర్లు ఉన్నఅభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన చేసి మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయనున్నారు. అయితే రెండో విడత కౌన్సిలింగ్ మెరిట్ లిస్టులో మీ పేరు రావాలి అంటే పదో తరగతి పరీక్షల్లో కేటగిరీల వారిగా ఎవరికి ఎన్ని మార్కులు వస్తే రెండో విడత కౌన్సిలింగ్ కి అర్హత సాధిస్తారని ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

1st Phase కౌన్సిలింగ్ లో మిగిలిపోయిన మొత్తం సీట్లు ఎన్ని?

  • AP IIIT 2025 మొదటి దశ కౌన్సిలింగ్ నిన్నటితో ముగిసింది. అయితే మొదటి దశ కౌన్సిలింగ్ నిర్వహించిన నూజివీడు ఆర్కే వ్యాలీ శ్రీకాకుళం ఒంగోలు త్రిబుల్ ఐటీ క్యాంపస్ లలో మొత్తం 702 సీట్లు మిగిలిపోయాయని అధికారులు ప్రకటించారు.
  • ఈ మిగిలిపోయిన సీట్లను రెండవ దశ (2nd Phase) కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా సీట్లను భర్తీ చేయడం జరుగుతుందని అధికారులు మీడియాకు వివరించారు.

AP IIIT 2nd Phase Results & Counselling Dates:

ఏపీ త్రిబుల్ ఐటీ 2025 2nd Phase ఫలితాలను జూలై 14వ తేదీలోగా విడుదల చేసి, ఆ వెంటనే రెండో దశ కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిసింది. రెండవ దశ మెరిట్ లిస్టులో పేర్లు ఉన్న విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధిత క్యాంపస్ కి వెళ్లి హాజరు కావాలని అధికారులు వెల్లడించారు.

2nd Results Expected Cut Off Marks:

ఏపీ త్రిబుల్ ఐటీ 2005 రెండవ దశ కౌన్సిలింగ్ కు ఎంపిక కావాలి అంటే పదో తరగతిలో ఎన్ని మార్కులు వస్తే వారు రెండవ దశ కౌన్సిలింగ్ కి ఎంపిక అవుతారు అనేటువంటి సందేహాలు విద్యార్థుల్లో నెలకొన్నాయి. ఇప్పుడు ఈ క్రింది వివరాలు ద్వారా ఎన్ని మార్కులు వచ్చిన వారికి రెండో దశ కౌన్సిలింగ్ లు అవకాశముంటుందో చూడండి.

  • Phase 2 లో మెరిట్ మార్కుల ఆధారంగా 10వ తరగతిలో 550 నుండి 600 మధ్య మార్కులు పొందిన OC/BC కేటగిరీల విద్యార్థులకు అవకాశం ఉంటుంది.
  • అదేవిధంగా, SC/ST/PHC అభ్యర్థులకు Phase 2 మెరిట్ లిస్టులో పేరు రావాలి అంటే వారికి పదో తరగతిలో 520 నుండి 570 మధ్య మార్కులు వచ్చినట్లయితే రెండవ దశ కౌన్సిలింగ్ కు ఎంపిక అవుతారు.

How To Check AP IIIT 2nd Phase Results:

ఏపీ త్రిబుల్ ఐటీ 2025 2ns phase ఫలితాలను ఈ క్రింది స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకోండి.

  1. ముందుగా ఏపీ త్రిబుల్ ఐటీ 2025 అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో “AP IIIT 2025 2nd Phase Results” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. వెంటనే స్క్రీన్ పైన 2nd phase మెరిట్ లిస్ట్ పిడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది.
  4. అందులో మీ పేరు ఉందేమో చెక్ చేసుకోండి.
  5. పేరు ఉన్నట్లయితే మీరు కౌన్సిలింగ్ కి కావలసిన అన్ని సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలి

AP IIIT 2025 2nd phase Results Website

పైన ఇచ్చిన లింకు ద్వారా మీరు ఏపీ త్రిబుల్ ఐటీ 2025 రెండవ దశ కౌన్సిలింగ్ ఎంపికైన విద్యార్థుల యొక్క మెరిట్ లిస్ట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top