POST OFFICE DAK DELIVERY CENTER

తక్కువ ఖర్చుతో విదేశాలకు పార్సిల్స్ పంపాలా? – పోస్టాఫీస్​లో అందించే ఈ సేవలు మీకోసమే –

పంపిచాల్సిన వస్తువు నమూనాలు తీసుకురావాల్సిన అవసరం లేదుకస్టమ్‌ అధికారిని కలవాల్సిన అవసరం ఉండదుపోర్టల్‌ ద్వారా వస్తువు ఎక్కడ ఉందో ట్రాక్ చేసే సదుపాయం

indian postal service international : చదువు, ఉద్యోగాల కోసం మనవారు చాలా మంది విదేశాలకు వెళ్తుంటారు. అక్కడే స్థిరపడుతుంటారు. ప్రతి చిన్న అవసరానికి వారు స్వగ్రామాలకు రావాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మనం వారికి ఏదైనా వస్తువులను చేరవేయాలన్నా అధిక మొత్తంలో ఖర్చులు చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కొన్ని సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వివరాల్లోకి వెళితే,

కేంద్ర ప్రభుత్వం ‘పోస్టాఫీసు డాక్‌ నిర్యత్‌ కేంద్రం’ ద్వారా మన ఇంట్లో నుంచి ఏ వస్తువునైనా వేరే దేశానికి పంపించే సేవలను అందిస్తోంది. ఈ కేంద్రాల ద్వారా ఉత్పత్తులను ఎయిర్‌ పార్శిల్, స్పీడ్‌పోస్ట్, ఐటీపీఎస్‌ ద్వారా తక్కువ ఖర్చుతో ఎగుమతి చేయవచ్చు. నగరంలోని జనరల్‌ పోస్టాఫీస్‌ (జీపీవో)లో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేశారు.

ప్రత్యేకతలు :

  • ఉత్పత్తి నమూనాలు తీసుకురావాల్సిన అవసరం లేదు.
  • ఎగుమతి పోస్టల్‌ బిల్లు నేరుగా దాఖలు చేయక్కల్లేదు. వెబ్సైట్‌లో పోస్టల్‌ బిల్‌ ఆఫ్‌ ఎక్స్‌పోర్ట్‌ (పీబీఈ)లో అవసరమైన పత్రాలు అప్‌లోడ్‌ చేస్తే సరిపోతుంది.
  • కస్టమ్‌ హౌస్‌ ఏజెంట్, కస్టమ్‌ అధికారిని కలవాల్సిన అవసరం ఉండదు.
  • కస్టమ్‌ తనిఖీ తర్వాత పీబీఈని పోర్టల్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
  • ఏవైనా విచారణలు, అభ్యర్థించిన పత్రాలకు నోటిఫికేషన్లు పోర్టల్‌లో అందుతాయి. వాటికి కావాల్సిన పత్రాలు పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తే చాలు.
  • ఈ-పోర్టల్‌ ద్వారా వస్తువు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.

జీపీవోలో డాక్నిర్యత్కేంద్రం ద్వారా సేవలు :

  • అంతర్జాతీయ స్పీడ్‌పోస్ట్‌ పార్శిల్‌ (ఈఎంఎస్‌): ఒక్కో పార్శిల్‌ 35 కేజీల వరకు, తక్కువ ఖర్చుతో 106దేశాలకు పంపిణీ చేయవచ్చు.
  • అంతర్జాతీయ ట్రాక్‌ చేయబడిన ప్యాకెట్‌ సర్వీస్‌(ఐటీపీఎస్‌): రెండు కిలోల వరకు పార్సిళ్లను యూఎస్‌ఏ పరిధిలోని 39 దేశాలకు, ఆసియా పసిఫిక్‌ రీజియన్ దేశాలకు చాలా తక్కువ ధరకు పంపించవచ్చు.

ఎగుమతులకు సులభ మార్గంజీఎస్టీ నంబరు ఉన్న వారు వేరే దేశాలకు ఏవైనా వస్తువులు సులువుగా ఎగుమతి చేసుకోవడానికి ఈ డీఎన్‌కేలు ఉపయోగించుకోవచ్చు అని హైదరాబాద్‌ జీపీవో ఛీఫ్‌ పోస్ట్‌మాస్టర్ ప్రసాద్ తెలిపారు.

రిజిస్ట్రేషన్‌ : ఎగుమతిదారులు https://dnk.cept.gov.in/customers.web/ పోర్టల్‌ ఓపెన్‌ చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. అదిపూర్తయ్యాక వారికి ఒక ఐడీ వస్తుంది. ఆ కోడ్‌ ద్వారా పాన్‌ / జీఎస్టీ నంబరు, అవసరమైన ఇతర పత్రాలు పూర్తి చేయాలి. తరవాత పంపించే వస్తువుల వివరాలను పోర్టల్‌లోని పీబీఈలో ఎంటర్‌ చేస్తే పీబీఈ నంబర్‌ వస్తుంది.

ఆయా వస్తువులను దగ్గరలోని డీఎన్‌కేకి తీసుకెళ్తే వారు ఓ లేబుల్‌(సీఎన్‌22, సీఎన్‌23 కస్టమ్స్‌ డిక్లరేషన్‌) వేస్తారు. దాన్ని విదేశీ పోస్టాఫీస్‌కు పంపిస్తారు. అక్కడ పరీక్షించి అవసరమైన పత్రాలను అడుగుతారు. అన్నీ పూర్తయిన తర్వాత వస్తువు ఎగుమతికి లెట్‌ ఎక్స్‌పోర్టు ఆర్బర్‌ను ఇస్తుంది. దాన్ని పీబీఈ కస్టమర్‌ ఐడీలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

1 thought on “POST OFFICE DAK DELIVERY CENTER”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top